నవీనమానవ యుగములో ముఖ్యముగా ఈ కలియుగములో ఎంత విజ్ఞత అభివృద్ధి చెందినా వాని ద్వారా సంభవించబోయే సమస్యలు ప్రమాదముల గురించి ఊహించి అనుభవసారముతో తెలిపిన కొన్ని ముఖ్య ప్రమాదముల గురించి అతిక్లుప్త రీతిలో వివరించుట మరియు వాటికి తగిన పరిష్కార మార్గములను అతిసులభ రీతిలో తెలియపరచుటయే ఈ వ్యాసముఖ్యోద్దేశ్యము. (ఈ వ్యాస రచనకు రూపకల్పమైనది వాట్సాప్లో ఒక అజ్ఞాన వ్యక్తిద్వారా ప్రచురింపబడిన ప్రముఖ సందేశములనే మూలాధారముగా చేసికొని వ్రాయడమైనది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు).
1.పనిచేయకుండా
దక్కేసంపద
బ్రహ్మ
సృష్టిలో సంపాదనకి రెండే మార్గములను నిర్దేశించడమైనది, అవి ధర్మమార్గం మరియు
అధర్మ మార్గం. ధర్మమార్గములో ఆర్జించిన సంపాదన మనిషిలో దైవత్వాన్ని పెంపొందింప చేస్తుంది. ధర్మనిరతిలో సంపాదించిన వారు ధైర్యముగా ఉంటారు.
ఆ ధైర్యమే వారికి ఆరోగ్యాన్ని అగణిత సుఖాలను సంప్రాప్తింప చేస్తుంది. మరి అధర్మబద్ధముగా చేసిన
ఆర్జన మనిషిలో అసుర తత్త్వాన్ని పెంచి
మానవత్వాన్ని మృగ్యంచేస్తుంది. నేటి కాలములో ఏ
వృత్తిలో నిమగ్నమైనా తాము చేసే పని
పైన దృష్టి కన్నా ఆ పని చేస్తే
తమకు ఏమి లాభము చేకూ
రుతుంది? అన్న ఆలోచనలు అధికమై
సంపాదన పక్కదారుల ఆర్జనకు సోపానము వేసినది. ఇదే పని చేయకుండా
దక్కే సంపద". ఈ ఐశ్వర్యాన్ని ఈ
ప్రపంచములో ఎంత ఎత్తున సమకూర్చుకొన్నామో
భగవంతుని దృష్టిలో అంత దిగజారిపోతాము. ఆ
సంపదని దాచేతీరుకి పడే వ్యాకులత దినదిన
ప్రవర్ధమానమై మనసులోని శాంతిని నెమ్మదిని కృంగదీస్తుంది. కష్టపడి న్యాయబద్ధముగా సంపాదించిన ఐశ్వర్యములో ఉన్న తృప్తి, సంతోషము
సులభరీతిలో అనవతరముగా లభ్యమైన సంపదలో ఉండదు.
అన్యాయ
సంపాదన మార్గములు:-1. పన్నులు సకాలములో సక్రమ రీతిలో చెల్లించక పోవడం, లంచగొండితనం, నల్లధనం, వ్యాపారంలో గడించిన అన్యాయపరమైన ఆర్జన, 5. రసీదులు లేని డొనేషన్స్, ఫీజులు
మరియు మోసభరితమైన తప్పుడు లెఖ్ఖలు వగైరాలు.
ఎదుర్కొను
మార్గములు:-
1.ప్రభుత్వానికి
సకాలంలో, సక్రమ రీతిలో పన్నులు కట్టి మనదైన సరైన దారిని నిరూపించుకొనడము
2 చేయ
వలసిన పనులకు లంచమాశించకుండా కర్తవ్య నిర్వహణలో నిమగ్నులము కావడము.
3.ఏ
ప్రభుత్వ అదికారులు పర్యవేక్షణకు వచ్చినా సర్వసన్నిద్ధముతో ధైర్యంగా నిలవగలగడము.
4.ప్రైవేట్
మరియు ప్రభుత్వ సంస్థలలో కృత్రిమ రీతులలో ఆర్జన వీడి, న్యాయరీతిలో ధర్మసమ్మతముగా చేయు ఆర్జనకే ప్రధమ
స్థానం ఇచ్చినచో ఆహ్లాదకరమైన శక్తి, సంతృప్తి మన స్వంతము అవుతాయి
అనడములో సందేహం ఎంత మాత్రములేదు.
2.వివేకము
కొరవడిన వినోదం
భావితరాల
వారు ఎదుర్కొనబోయే రెండవ ముఖ్య
ప్రమాదము "వివేకం కొరవడిన వినోదం"
పూర్వకాలములో
మనం వినోదాన్ని అనుభవించడానికి, రేడియో, గ్రామఫోను, వీధి నాటకములు, నృత్యములు
అరుదుగా సినిమాలు, పుస్తకాల పఠనం, కొన్ని ఆటలు, క్రీడలూ వినోదానికి ఊపిరి పోసేవి. వాటిలో "వినోదం” ఎంత ఉండెడిదో "వివేకం"
అంతే మూర్తీభవించి ఉండెడిది. హాస్య పాత్రలలో సహితం వారి మాటల్లో, పాటల్లో
వినోదం వివేకముతో కూడినదై ఉండుట ఒక విశేషమైతే సంగీత,
సాహిత్య రచనలు భారతీయ సంస్కృతీ సంప్రదాయములతో అలరారుట మరియొక విశేషం. ఆడే ఆటలు, క్రీడలు
ఏ కంప్యూటర్లూ అందించలేని విజ్ఞతతను , మెదడుకు చురుకుతనాన్ని సంప్రాప్తింపచేసేవిమరి.
నేడు
నూటికి 90% వినోదం హింసాత్కమే. ఒక 10% వెతుకుదామన్నా కానరాని వినోదము, వివేకము అహింసతత్వం. కోట్ల ఖర్చుతో తీసే సినిమాలు చూడటానికి
ప్రజలు పడే ఆరాటం, వందల
కొలదీ ఖరీదైన టిక్కెట్లు కొని "ఐనక్స్" ధియేటర్లలో పానీయములు సేవిస్తూ లభ్యమైన చిరుతిండ్లు (జంక్ పుడ్) తింటూ
ఆనందించే వినోదంలో "వివేకం" శూన్యం. ఒకటి మితిమీరిన శభ్ధములు,
గగుర్పాటు కలిగించే సన్నివేశములు, హింసతో కూడిన వాక్బాణములు కలిగించే అసౌకర్యం మరియు తినే అహారములు శరీర
ఆరోగ్యానికి (ఊబకాయ పెరుగుదలలకు) ప్రమాదకరమే. ఇది డబ్బుతో కొనుక్కున్న
హానికర వినోదమే నా దృష్టిలో అనిపిస్తుంది.
ఇదే విజ్ఞత, ఆధునిక పరికరములు సరి అయిన రీతిలో
ఉపయుక్తకరమైతే ఎంత విజ్ఞాన ఝరి
ప్రవహించుతుందో కదా!
నేడు
పురిటిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ఆనందించే వినోద
పరికరములే స్మార్ట్ ఫోన్, సినిమాలు, టి వీ, వాట్సాప్,
పేస్ బుక్ మరియు విడియో
క్రీడలు వగైరా ఈ వినోదం కొంత
వరకు సామాజిక రూపురేఖలను మార్చివేసినది. అనుకరణాభిలాషలతో పెరిగే యువతలో భిన్నతరహా ప్రవర్తన, పెద్దలను ఎదిరించేస్థితి, మరియు సత్ సంబంధాలు దూరమయ్యే
పరిస్థితి వైపు పయనిస్తున్నాయి.
కొన్ని తప్పుడు ప్రచారములు, గోరంతలు కొండంతలు చేసి చెప్పే విధానం
కలతలకు వేదికగా మారినవి.
ఏ కాలమైనా మనలో మార్పు తెచ్చి
శాంతి నెమ్మదులను పెంపొందింపచేసేది వివేకంతో కూడిన వినోదమే. ఆ వినోదాన్ని లభ్యపరచే
సాధనము "మీడియా" కావున ఇప్పటికీ సమయం మించిపోలేదు. వారు
ఎంత హింసాత్మిక సంఘఠనలు చూపినా వివేకాన్ని వినోదం పేరును రూపు మాపినా మనము
మనదైన తీరులో నడిస్తే ఏ చెడుమార్పులూ మనదరికి
రావు. ఉదా:- కమల పుష్పం సదా
బురద నీటిలోనే ఉంటుంది. తన పరిసరములను తనే
శుద్ధి పరచుకొని స్వచ్చమైన జలమును మనకు అందిస్తుంది. సుమధురమైన
సువాసనలను విరజిమ్ముతుంది. అదే రీతిలో ధైర్య
స్థైర్యములు మనలో రావాలి అంటే
మనో నిశ్చలత, నిబ్బరం, ధృఢనిశ్చయం, మంచి ఆలోచనలు, శాస్త్రీయ,
సాంఘిక పురాణ ఇతిహాసములను వివరించ గలిగే అవగాహన కలిగి మనదైన రీతిలో పొందే "వినోదం" ఎటువంటి వారికైనా ఎప్పటికీ వివేకమును పెంపొందింపచేస్తుంది.
3.మానవత్వం
మృగ్యమైన సైన్స్
నేడు
ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న పొంచిఉన్న ప్రమాదం "మానవత్వం మృగ్యమైన సైన్స్". "విజ్ఞానము" (సైన్స్) అనునది మానవత్వాన్ని, సర్వ జీవరాశులను సంరక్షించే
తీరులొ అభివృద్ధి చెందుతేనే దాని విలువ ఉన్నతమైనదిగా
పరిగణింపబడుతుంది. యుగయుగాల చరిత్ర నుంచి భారతదేశాన్ని ఏలిన చక్రవర్తుల కొరకు
దివ్య విమానములు వచ్చి సగౌరవముగా వారిని సశరీరముతో స్వర్గాన్ని తలపింప చేయుట వేదవివరణ. సమస్త భూమండలాన్ని ఏలిన భారతదేశ పరిపాలకులు
కొన్ని లక్షల యోజనముల దూరములో నెలకొన్న ఊర్ధ్వలోకములను వీక్షించి మరల భువికి తిరిగి
రాగలిగిన అతి వీరులు ధీరులు
ఈ ధరణిపై వెలిసారు.
కాలవశమున
ప్రకృతి భీభిత్సములలో ఈ సైన్స్ శక్తి
కనుమరుగై నేటి మానవ ఊహలకు
అందరానిది అయిపోయినది.
మన పూర్వీకులు వారి విజ్ఞాన సంపదను
దేశరక్షణకు ప్రజల రక్షణకు వినియోగించెడివారు. కానీ నేడు సైన్స్
అభివృద్ధి వక్రించినది. అల్పజీవులను ఆర్ధికంగా వెనుకపడిన చిన చిన్న దేశాల
మీద అగ్రరాజ్యాధి నేతలు తమవద్ద ఉన్న విస్ఫోటకములను ఉపయోగించి
వారి అసహాయతను స్వలాభముకొరకు తమ
ఆధిక్యతను అన్ని రంగాలలో ప్రకటించుట అధికార
దర్పమే. ఈ మానవత్వం మరచిన
సైన్స్ అభివృద్ధి ఒక్క యుద్ధరంగాలలోనే కాదు
అన్ని రంగాలలో ఈ రీతిలో వ్యాప్తీకరించబడినది.
1.జీవనదుల
పైన కట్టిన బహుళార్ధక ప్రాజెక్టులు.
2.కూకటివేళ్ళతో
పెకలించే మహావృక్ష సంపద.
3.అత్యధికముగా
వాడుక లోనికి వచ్చిన ప్లాస్టిక్
4.అధిక
ఉత్పత్తుల కొరకు, కొన్ని పదార్ధముల నిల్వల కొరకు ఉపయోగించే రసాయనముల తయారీ.
5.వ్యాపారాభివృద్ధికై
పశువుల పాలను మెషిన్స్ ద్వారా తీయడం
6.లెక్క్ఖకు
మించిన కర్మాగారములు అవి విడుదలచేసే కలుషిత
నీరు సముద్రాలు, నదులు, ఏరులు, సెలయేరులు మురికితో కలుషితమయం చేయుట.
7.అంతులేని
అణువిస్ఫోటక ప్రయోగములు ఒకరిని మించి ఒకరు పోటీలతో చేయు
ప్రయోగములు.
8.భూఖనిజాలు
అత్యధికముగా మెషిన్స్ ద్వారా వెలికి తీయడం
అవనిపై
మానవ జీవచరాలకు ఎంతో నష్టం కలిగించుట
శోచనీయమే.
వీటి
నివారణ మన చేతిలోనే ఉన్నది
ఈ రీతిలో:-
1.చెడు
పనులకు మరియు మానవ విధ్వంశతకు సాంకేత
పరమైన సైన్స్ అందించవద్దు.
2.నదుల
పైన చిన చిన్న ఆనకట్టలు
నిర్మించి వరదనీటిని కాలువల ద్వారా సుదూర తీరములకు మళ్ళించుట వలన వరదలు అరికట్టబడతాయి.
సిల్ట్ వెలికి తీయుట సులభతరమౌతుంది. అధిక నీరు నిల్వలు
నదులలో పెరుగుతాయి.
3.వృక్షో
రక్షతి రక్షితః" అను విజ్ఞత పెంపొందింపచేశికొనుట
వలన భూతలాన్ని సశ్యశ్యామలంగా తీర్చిదిద్ద వచ్చును.
4.దూడని
వదిలితే పాలు చేపు అధికమై
పశువులు ఎంతో ఆరోగ్యకరమైన రీతిలో
అధిక క్షీరమును ఉత్పత్తి చేస్తాయి అనునది ఒక విశేషమైతే పశువుల
ఆరోగ్యం సంరక్షింపబడుట మరియొక విశేషము.
5.ప్లాస్టిక్
ఉపయోగించుట గత 50 సవత్సరముల నుంచి అధికమై పెనుభూతంలా మారినది. నీటిలో వేయి సంవత్సరములు ఉంచినా
నానదు. నిప్పులో కాల్చినా వాతావరణం విషతుల్యము అవుతుంది. ఎండలో ఎండదు కావున ఇది సైన్స్ ద్వారా
వచ్చి చేరిన వినాశమే. ప్రస్తుతము ప్లాస్టిక్ వాడుకను నిషేధించుట ముఖ్యమని గ్రహించిన విజ్ఞానవేత్తలు మరల పాత పద్ధతులలో
పేపర్ కవర్లు, సంచీలు వగైరా వాడుకలోనికి చేర్చడము ముదావహమే.
6.రసాయనముల
వాడకము వీలైనంత తగ్గించిన ఆహారము సేవించుట ఆరోగ్యకరము. ప్రకృతిలో లభ్యమైన ఆర్గానిక్ ఎరువుల ద్వారా పండించిన కూరలు, పండ్లు, కాయధాన్యములు ఉపయోగించుట ఎంతో స్వచ్చతతో కూడిన
ఆరోగ్యకరమైన ఆహారము.
7.భారీ
పరిశ్రమలు సాధ్యమైనంత వరకు బీడు భూములలో
సుదూరతీరములలో నెలకొల్పిన వాటి ద్వారా విడుదల
అయ్యే కలుషితములు శుద్ధిపరచి ఆ నీటిని విడుదల
చేయుట మన స్వచ్చతకు నిదర్శనమే.
8.భూమిలో
నిక్షేపితమైన వివిధ ఖనిజములను అత్యధిక సంఖ్యలో వెలికి తీయుట హానికరమే. కారణము మరల ఆ ఖనిజములను
ఉత్పత్తి చేయుటకు భూమికి కొన్ని కోట్ల సంవత్సరములు అవసరము. భూగర్భములో వెలితి ఏర్పడి భూకంపములు, లావాఉత్పన్నములు ఎన్నో అనర్ధములు సంభవించుట వానిని అరికట్టుట అనునవి మానవ విజ్ఞతకు అందనివే.
పైనచెప్పిన
కొన్ని నిబంధనలు మనము పాటిస్తే తప్పక
మానవత్వం ప్రస్ఫుటించబడుతుంది. సైన్స్ విజ్ఞతముందు సమస్త మానవ లోకం ప్రణమిల్లుతుంది.
4. వ్యక్తిత్వం
లోపించిన విజ్ఞానం
నేడు
ప్రపంచ మానవాళిలో ప్రస్పుటించే అతిముఖ్యమైన ప్రమాదమే
"వ్యక్తిత్వం లోపించిన విజ్ఞానం". మనిషికి మానవత్వం అనునది ఒక విజ్ఞాన గని.
ఇందులోనే "వ్యక్తిత్వం" అనునది ప్రభవిస్తుంది. చదువుకున్న విజ్ఞానవేత్తలలోనే వ్యక్తిత్వం వెల్లివిరిస్తుంది అనునది మన ప్రగాఢ విశ్వాసం.
కానీ వ్యక్తిత్వము ప్రకటితమవడానికి కావలసినవి ధనం, విద్య, ప్రశంసాపత్రాలు,
పేరు ప్రతిష్ఠలు, మరియు విలువైన ప్రాపంచిక భోగములతో కూడిన బహుమతులు మాత్రమే కాదు. వ్యక్తిత్వం అనునది వారు చేసే పనులు
మాట్లాడే తీరులోను ప్రభవిస్తుంది. అవి మనిషిలోని మంచితనాన్ని
నిరూపణ చేస్తాయి. కేవలం డిగ్రీలు సంపాదించుకొనే విద్యను నేర్వడముతోనే ఆగిపోకుండా నడవడికను చక్కపరచే విద్యను
నేర్పాలి.
1.వ్యక్తిత్వం
అనునది చిన్ననాట తల్లితండ్రుల వద్ద నేర్పబడుతుంది.
2.తరువాత
కాలములో ఉపాధ్యాయుల వద్ద నేరుస్తారు.
3.తదనంతరం
స్నేహితుల వద్ద నేర్చుకొంటారు.
3.తదనంతరము
భార్యబిడ్డల వద్ద, బంధు బలగములు వద్ద
తమనుతాము తీర్చి దిద్దుకొంటారు.
4.సహోద్యోగులు
తగు భాధ్యత వహించి మనలో వ్యక్తిత్వాన్ని
పెంపొందిస్తారు.
5.వయసు
మళ్ళిన రోజుల్లో ఆధ్యాత్మిక భావనలో, దైవారాధనలో వారి అనుభవసారంలో వ్యక్తిత్వం
సదా నిలుస్తుంది.
మంచి
వ్యక్తిత్వం మనలో పెరగటానికి కొందరు
ప్రముఖుల దృష్తిలో నిర్దేశింపబడిన ముఖ్య సూత్రములు:-
1. గాంధీ:-
వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి సర్వం కోల్పోయినట్టే.
2.రమణమహర్షి:-
కోరికలు మితంగా ఉంటే బాధ్యతలు పరిమితంగా
ఉంటాయి. ఇవి జీవితం వినాశనం
కాకుండా వ్యక్తిత్వాన్ని అదుపులో పెడతాయి.
3.రాజారాం
మోహన్ రాయ్:-చెడుని చూపడం కాదు. దాని స్థానంలో మంచిని
తెప్పించగలగడమే నిజమైన సంస్కరణ. ఇదే నిజమైన వ్యక్తిత్వం.
4. స్వామి
వివేకానంద:- ఎంత చిన్న పనైనా
సరే సరి అయిన తీరులో
చేస్తే మంచి ఫలితం వస్తుంది.
అందులో మన వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది.
5.సుభాషితం:-గౌరవం తెచ్చుకోవడము అంటే పదవిని చూసి
నిలబడటము కాదు. వ్యక్తిత్వాన్ని చూసి నమస్కరించడము.
6.ఐన్
స్టీన్:- వ్యతిరేక భావాలు, వ్యతిరేక స్వభావంగల వారికి దూరంగా ఉంటే మనకొచ్చిన సమస్యలు
చాలావరకు తగ్గుతాయి. మనవ్యక్తిత్వపు విలువలు పెరుగుతాయి.
7. సి.సి. రో:- సమస్య
వెనక పరిష్కారం, కష్టం వెనుక సుఖం తప్పక ఉంటాయి.
మనం చేయాల్సిందల్లా సహనంగా ఉండటమే. ముందు మనపై మనం విజయం
సాధించాలి. అపుడు మనం ప్రపంచాన్ని గెలిచినట్టే.
అబద్ధం మనలో తప్పించుకొనే ధోరణి
పెంచితే నిజాయితీ మనం చేసే మంచి
పనులలో నిరూపించబడుతుంది. వ్యక్తిత్వన్ని గుబాళింప చేస్తుంది.
8.సుభాషితం:-
వ్యక్తిత్వమనేది బడాయి కబుర్లలోను, బుకాయింపు మాటలలోను, అధికారం చెలాయించడములోను కాదు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక మంచి పని
ధైర్యంగా చేయడములో ఉంటుంది. అవి రాజకీయాలు కావచ్చు
లేదా సామాజిక ధర్మాలు కావచ్చు వేటినైనా సరే ఎదుర్కొనే ధోరణి
పెంచుతుంది.